హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాలను కేటీఆర్ తప్పుపట్టారు. వ్యవసాయ చట్టాలు రైతులకు అర్థం కావు. వ్యాపారులకు జీఎస్టీ అర్థం కాదు. పెద్ద నోట్ల రద్దు సామాన్యులకు అర్థం కాదు. సీఏఏ ముస్లింలకు అర్థం కాదు. ఎల్పీజీ ధరలు హోం మేకర్స్కు అర్థం కాదు. ఇప్పుడు అగ్నిపథ్ యువతకు అర్థం కాదు. కేవలం విశ్వగురుకు మాత్రమే ఆ అర్థం తెలియాలి అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
❇️ Farmers don’t understand #FarmLaws
❇️ Traders don’t understand #GST
❇️ Common man doesn’t understand #Demonetisation
❇️ Muslims don’t understand #CAA
❇️ Homemakers don’t understand #LPG prices
❇️ Now youth don’t understand #AgniveerOnly #VishwaGuru can fathom🙏
— KTR (@KTRTRS) June 17, 2022