హైదరాబాద్ : స్వరాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసి, రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా టీఆర్ఎస్ పార్టీ నిలిపిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకల సందర్భంగా రెండు కవితలను కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ గళం.. బలం.. అగ్రగామి దళం.. టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మట్టి కోసమే పుట్టి గమ్యాన్ని ముద్దాడిన విముక్తి కేతనానికి 20 ఏండ్ల పండుగ అంటూ కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ మట్టి కోసమే పుట్టి
— KTR (@KTRTRS) October 25, 2021
గమ్యాన్ని ముద్దాడిన విముక్తి కేతనానికి
20 ఏండ్ల పండుగ!
స్వీయ రాజకీయ అస్తిత్వ
పతాకానికి
దిగ్విజయ ద్విదశాబ్ది వేడుక!
తెలంగాణ గళం ..బలం.. అగ్రగామి దళం
TRS!
జలదృశ్యం నుండి
సుజల సుఫల దృశ్యాల దాకా
ప్రపంచం చూడని.. మహోన్నత
పరివర్తనా ప్రస్థానం!#20YearsOfTRS pic.twitter.com/gAZUPpnd7j
తరతరాల యమ యాతన తీర్చి
— KTR (@KTRTRS) October 25, 2021
తలరాతను మార్చిన విముక్తి
కేతనం!
స్వీయ పాలన సిరులొలికిస్తున్న
వికాస పతాకం!
భూమిపుత్రుడు ఎగరేసిన గులాబీ
జెండా..తెలంగాణ చరితకు ,భవితకు
అండదండ..!
జలదృశ్యం నుండి..
సుజల సుఫల దృశ్యాల దాకా
20 ఏండ్ల మహోన్నత ప్రస్థానం!#20YearsOfTRS pic.twitter.com/ItcixYMJ5O