KTR | హైదరాబాద్ : స్వరాష్ట్ర సాధన కలను నెరవేర్చడమే కాదు.. గిరిజనులు, ఆదివాసీ బిడ్డల చిరకాల డిమాండ్ అయిన స్వయంపాలనా స్వప్నాన్ని కూడా సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గిరిజన దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ గిరిజనులకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ట్వీట్ చేశారు.
‘మావ నాటే మావ రాజ్’ మా తండాల్లో మా రాజ్యం!
దశాబ్దాల పాటు దగాపడ్డ ఈ నినాదం
దశాబ్ద కాలంలోనే నిజమైన నిలువెత్తు విధానం!
స్వరాష్ట్ర సాధన కలను నెరవేర్చడమే కాదు,
గిరిజనులు, ఆదివాసీ బిడ్డల చిరకాల డిమాండైన
స్వయంపాలన స్వప్నాన్ని కూడా సాకారం చేశారు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
విసిరేసినట్టుగా ఉన్న తండాల్లో
అద్భుత వికాసం నేడు..
గాయాలతో గోసపడ్డ గోండుగూడేల్లో
అచంచల విశ్వాసం నేడు.
తెలంగాణలో…
గిరిజనుల గడప గడపకు సంక్షేమం..
కొత్త పంచాయతీల్లో కదంతొకే ప్రగతిపథం..
కొండకోనల్లోని ఇండ్లల్లో పరవళ్లు తొకే జలదృశ్యం..
గిరిజనులు ఆదివాసీల అభ్యున్నతిలో ఇదో స్వర్ణయుగం.
రాజధాని నడిబొడ్డున వెలసిన ఆత్మగౌరవ భవనాలు స్వరాష్ట్రంలో సగర్వంగా తలెత్తుకునే నిలువెత్తు ప్రతీకలు గురుకులాల్లో విరబూస్తున్న విద్యాకుసుమాలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్న సందర్భాలు పది శాతం వరకు పెంచుకున్న రిజర్వేషన్ ఫలాలు ప్రత్యేక ప్రగతి నిధితో మారుతున్న బతుకు చిత్రాలు నడుస్తున్న తెలంగాణ చరిత్రలో ఇవన్నీ సువర్ణాక్షరాలే.!
అందుకే.. తెలంగాణ నలుదిశలా..
మారుమోగుతున్న ఒకేఒక నినాదం
గిరిజనుల గుండెచప్పుడు…కేసీఆర్
ఆదివాసీల ఆత్మబంధువు… కేసీఆర్
ఆకాశమే హద్దుగా..
పచ్చని ప్రకృతే సంసృతిగా..
సాగుతున్న గిరిజనుల ప్రగతి ప్రస్థానం
మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మా గిరిజన తోబుట్టువులందరికీ… నా హృదయపూర్వక శుభాకాంక్షలు!
అందుకే..
తెలంగాణ నలుదిశలా..
మారుమోగుతున్న ఒకేఒక్క నినాదం
గిరిజనుల గుండెచప్పుడు… కేసిఆర్
ఆదివాసీల ఆత్మబంధువు… కేసిఆర్ఆకాశమే హద్దుగా..
పచ్చని ప్రకృతే సంస్కృతిగా..
సాగుతున్న గిరిజనుల ప్రగతి ప్రస్థానం
మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ…దశాబ్ది… pic.twitter.com/JfgHskSaus
— KTR (@KTRBRS) June 17, 2023