హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ సాధించిన ప్రగతిని చూస్తుంటే ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. ఈ ఉత్తేజకరమైన జర్నీలో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ చారిత్రాత్మకమైన రోజున తెలంగాణను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు పునరంకితం అవుదామని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
So fulfilling to see the strides of progress that #Telangana has made since the formation of the State on June 2, 2014
Feel blessed to be a part of this exciting journey
On this historic day, let’s rededicate ourselves to taking Telangana to newer heights#JaiTelangana#JaiKCR
— KTR (@KTRTRS) June 2, 2022