హైదరాబాద్ : నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో పోటీ ఎవరి నడుమ ఉంటుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్లగొండ బిడ్డలకు శాపంగా ఇచ్చిన కాంగ్రెస్ పక్షాన ఉంటారా? ఫ్లోరోసిస్ నిర్మూలనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కూడా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ వైపు నిలబడుతారా? ఫ్లోరోసిస్ నుంచి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన టీఆర్ఎస్ వైపు ఉంటారా? అని అడిగారు. ఈ మూడు పార్టీల్లో పోటీ ఎవరి నడుమ ఉంటుందని కేటీఆర్ ప్రశ్నించారు.
మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ?
ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్
ఫ్లోరోసిస్ నిర్ములనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ
ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన తెరాస
— KTR (@KTRTRS) October 3, 2022