హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేరకపోవడాన్ని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ చేసే వాగ్దానాలన్ని జూమ్లాలుగానే మిగిలిపోతాయని కేటీఆర్ మండిపడ్డారు. ఆయన బూటకపు వాగ్దానాలపై ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని మంత్రి తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రతి భారతీయుడికి 2022 నాటికి ఇల్లు అని మోదీ చేసిన వాగ్దానానికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. క్యా హువా తెర వాదా అనే హ్యాష్ ట్యాగ్తో కేటీఆర్ ట్వీట్ చేశారు.
The list of PM @NarendraModi Ji’s promises & JUMLAS is never-ending; one for instance 👇
It’s time to remind & question Mr Modi for all the fake promises and ask him #KyaHuaTeraWada pic.twitter.com/nqdylvSlL3
— KTR (@KTRTRS) August 5, 2022