హైదరాబాద్ : డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిన రోజు. ఉద్యమ నాయకుడు, నేటి మన సీఎం కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చి, స్వరాష్ట్ర సాధనకు నాంది పలికిన రోజు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితమైన వ్యాసాన్ని తన ట్విట్టర్ ఖాతాలో కేటీఆర్ షేర్ చేశారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అన్న ఉద్యమ వీరుని ప్రస్థానానికి నేటితో పన్నేడేండ్లు పూర్తయిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఒక దీక్ష.. ఒక విజయం.. ఒక యాది.. శీర్షిక పేరున నమస్తే తెలంగాణ దినపత్రికలో మీడియా అకాడమీ డైరెక్టర్ అల్లం నారాయణ రాశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణకు కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఒక దీక్ష.. ఒక విజయం.. ఒక యాది.. ఉద్యమ వీరుని ప్రస్థానానికి నేటితో పన్నెండేండ్లు
కరోనా వ్యాక్సినేషన్లో తెలంగాణ మరో మైలురాయి
డిసెంబర్ 9.. తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు: మంత్రి హరీశ్ రావు