KTR | హైదరాబాద్ : పదో తరగతి ప్రశ్న పత్రం( Tenth Exam paper ) లీకేజీ కుట్ర వెనుక సూత్రధారిగా తేలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay )పై మంత్రి కేటీఆర్( Minister KTR ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా బండి సంజయ్పై ఘాటు విమర్శలు చేశారు.
పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్లకు ప్రమాదం.. కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని మంత్రి హెచ్చరించారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్ చేసి అమాయకులైన విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటం ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
పిచ్చోని చేతిలో రాయి ఉంటే..
వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!!కానీ
అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే
ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!!తమ స్వార్థ రాజకీయాల కోసం
ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు #BJPleaks https://t.co/8GFI6ups6v— KTR (@KTRBRS) April 5, 2023