KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత వారం రోజుల నుంచి బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఒకే రోజు నాలుగైదు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తున్నారు. తీరిక లేకుండా పర్యటిస్తున్న కేటీఆర్ తన బిజీ షెడ్యూల్ గురించి ఓ ట్వీట్ చేశారు.
జిల్లాల పర్యటనకు వెళ్తూ.. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న సమయంలో.. దొరికిన ఆ కొద్ది సమయంలో తదుపరి ఈవెంట్ గురించి ప్రిపేర్ అవుతున్నాను అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దాదాపు ఓ విద్యార్థి పరీక్షకు ప్రిపేర్ అవుతున్న మాదిరిగానే తన షెడ్యూల్ ఉందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
When on a whirlwind tour, need to use the little window of time to prepare for next event
Almost like a student preparing for an exam 😁 pic.twitter.com/O3grtMFvWQ
— KTR (@KTRBRS) May 9, 2023