హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ నెల 20న ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్తో కలిసి మంత్రి, కేటీఆర్ బహిరంగ సభ కోసం ఎల్బీ కళాశాల మైదానాన్ని పరిశీలించారు.
20న కేటీఆర్ నియోజకవర్గ కేంద్రంతోపాటు వరంగల్ వరంగల్, హనుమకొండ నియోజకవర్గాలలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తారు. ఆరోజు కేటీఆర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు అభివృద్ధి పనులతో బిజీ బిజీగా గడపనున్నారు. ఏర్పాట్ల నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులతో, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికే సమీక్షించారు. బహిరంగ సభ స్థలం ఫైనల్ అయిన తర్వాత మంత్రి కేటీఆర్ పర్యటన కు సంబంధించిన ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల రూట్ మ్యాప్ సిద్ధం కానుంది.