హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్ ద్వారా జైనథ్ మండలం దీపాయిగూడలో ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శిస్తారు. అనంతరం ఆదిలాబాద్ పట్టణంలోని బీడీఎన్టీ డాటా సొల్యూషన్ ఉద్యోగులతో మాట్లాడుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీని సందర్శిస్తారు. అక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేసి, బాసర నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు.