Minister KTR | భారీ వర్షాల నేపథ్యంలో అలెర్ట్గా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్తో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి వర్షాలపై సమీక్షించారు. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. గతవారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ అలెర్ట్గా ఉండాలని ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంపైన ఉన్న చిన్న బోనాల చెరువు తెగడంతో పట్టణంలోని ప్రభావిత వర్షాభావ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైతే సహాయక చర్యల కోసం హైదరాబాద్ నుంచి అవసరమైన సామగ్రి పంపిస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలోనే ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.