హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): దేశంలోని అన్ని నగరాల్లో పార్కింగ్ సమస్య ఉన్నదని, అది ఒక సవాలుగా మారిందని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో మల్టిలెవల్ పార్కింగ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. మంగళవారం ట్విట్టర్లో ఓ నెటిజన్ చేసిన సూచనపై కేటీఆర్ స్పందించారు. కొత్తగా ప్రతిపాదించిన మెట్రోమార్గాల్లో, ఇతర భారీ పార్కింగ్ ప్రాంతాలతో పార్క్ అండ్ రైడ్ మోడ్కు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
ఖాళీ స్థలాల యజమానులు తమ ఆస్తిని పార్కింగ్గా మార్చుకోవడానికి, వారితో కలిసి పనిచేసే ఆలోచన కూడా చేశామని, దీని ద్వారా భూ యజమానులకు ఆదాయం కూడా వస్తుందని తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో నూతన అంబులెన్స్లను సీఎం కేసీఆర్ ప్రారంభించిన నేపథ్యంలో అత్యవసర సేవలు మరింత మెరుగవుతాయని మంత్రి కేటీఆర్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావును అభినందించారు.