KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. జ్ఞానం తెలిసిన పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల దాకా.. కేటీఆర్ పేరు అందరికీ సుపరిచితమే. యూత్లో కేటీఆర్( KTR )కు మంచి ఫాలోయింగ్ ఉంది. కేటీఆర్ స్పీచ్లు వినేందుకు బాగా ఆసక్తి చూపుతారు. అంతేకాదు.. ఆయన కనిపిస్తే చాలు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతారు. మరి అంతటి ఫాలోయింగ్ ఉన్న కేటీఆర్తో సెల్ఫీలు దిగేందుకు ఆరేడు ఏండ్ల వయసున్న పిల్లలు ఆసక్తి చూపించారు. అన్న ఓ సెల్ఫీ అని అడగ్గానే కారు ఆపి ఆ చిన్నారులతో సెల్ఫీ దిగారు కేటీఆర్. ఈ సందర్భంగా పిల్లలు జై రామన్న.. జై జై రామన్న అని నినదించారు. ఈ సంఘటన తంగళ్లపల్లి మండలంలోని చీర్లవంచలో ఆవిష్కృతమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ అంతకు ముందు తంగళ్లపల్లి మండలం గోపాల్ రావు పల్లెలో పర్యటించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు. తంగళ్లపల్లి మండలం కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలను ప్రారంభించారు. మండేపల్లిలోనూ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు కేటీఆర్.