హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నిక కోసం గత నెల రోజులుగా టీఆర్ఎస్ పార్టీ తరఫున శ్రమించిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులందరికీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
పార్టీ ఆదేశాల మేరకు తమ తమ ప్రాంతాల నుంచి వచ్చి మునుగోడులో ఉంటూ టీఆర్ఎస్ సుపరిపాలనను అక్కడి ప్రజలకు వివరించి పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఇంచార్జిలకు, నాయకులకు, వారితో వచ్చిన కార్యకర్తలకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకారం అందించిన సోషల్ మీడియా వారియర్లకు సైతం పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.