హైదరాబాద్ : సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కొందరు వన్ ఇండియా అని అంటున్నారు. భారతదేశమంతా ఒకటి ఉండాలని నేను చెప్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. మన గొప్ప సంప్రదాయాలన్నింటిలో ఏకత్వాన్ని ఆస్వాదిద్దామని ఆయన విజ్ఞప్తి చేశారు. విచ్ఛిన్నం చేసేవాటిని కాదు.. మనల్ని ఐక్యం చేసేవాటిని ప్రేమిద్దాం అని మంత్రి కేటీఆర్ కోరుతూ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.