హైదరాబాద్: వాతావరణ మార్పులతో తక్షణ ముప్పు పొంచి ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. వాతావరణంలో తరచూ మార్పులు జరగకుండా సమతుల్యంగా ఉండాలన్నా, భూమిని రక్షించుకోవాలన్నా.. ‘తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం’ తరహా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సుస్థిరాభివృద్ధి, చెట్లపెంపకంపై భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని వెల్లడించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘వాతావరణ మార్పులతో తక్షణ ముప్పు పొంచి ఉంది. దేశంలోని ప్రతి రాష్ట్రం ఈ అంశంపై తప్పకుండా దృష్టి సారించాలి. ‘తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం’ తరహా కార్యక్రమాలు చేపట్టాలి. సుస్థిరాభివృద్ధి, చెట్లపెంపకంపై భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించాలి’ అని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
With climate change being an imminent & immediate threat, every state in India needs to replicate this
Sensitisation of next generation on sustainable development & green initiatives is a must for all https://t.co/mLpvsLXB5f
— KTR (@KTRTRS) September 16, 2022