హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ టెక్స్టైల్ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. వ్యవసాయం తరువాత అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ రంగంపై మోదీ ప్రభుత్వానికి చిన్నచూపు, నిరాసక్తత ఉన్నదని పేర్కొన్నారు. శుష వాగ్దానాలు- రిక్త హస్తాలు అన్నట్టు వ్యవహరిస్తున్న మోదీ సరార్ తెలంగాణ నేతన్నల కడుపు కొడుతున్నదని మండిపడ్డారు. టెక్స్టైల్ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సాయం, చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర టెక్స్టైల్శాఖ మంత్రి పీయూష్ గోయల్కు మంత్రి కేటీఆర్ శనివారం లేఖ రాశారు.
తెలంగాణ టెక్స్టైల్ రంగానికి సాయం చేశామంటూ ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు వల్లె వేసే అసత్యాలు మాని, నేతన్నకు సాయం చేస్తే మంచిదని లేఖలో హితవు పలికారు. నిజానికి తెలంగాణ టెక్స్టైల్ రంగానికి, చేనేత కార్మికులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నయా పైసా అదనపు సాయం చేయలేదని ఆరోపించారు. వ్యవసాయం తరువాత దేశంలో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ రంగ ప్రస్తుత దుస్థితికి కేంద్ర ప్రభుత్వ మతిలేని విధానాలే కారణమని దుయ్యబట్టారు. తెలంగాణ టెక్స్టైల్, చేనేత రంగానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారానికి సంబంధించిన వివరాలను లేఖలో పొందుపరిచారు.
నిధులు, నియామకాలు, నీళ్లతోపాటు నేతన్నల బాగు కోసం ఉద్యమించిన తాము, అధికారంలోకి వచ్చిన ఈ 8 ఏండ్ల నుంచి టెక్స్టైల్ రంగాన్ని ఆదుకోవాలని వివిధ రూపాల్లో కేంద్రాన్ని కోరామని అన్నారు. భారతీయ ఆత్మకు ప్రతీక అయిన ఎన్నో రంగాలను నిర్వీర్యం చేసినట్టుగానే మోదీ ప్రభుత్వం టెక్స్టైల్, చేనేతరంగంపై కూడా కక్ష కట్టిందని ఆరోపించారు. అందుకే ఈ రంగం బాగు కోసం ఏ మాత్రం ఆలోచించకుండా చేనేతపై జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకొంటూ నేతన్నల పొట్టగొడుతున్నదని విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలు అంశాలను తన లేఖ ద్వారా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు.
కాకతీయ మెగా టెక్స్టైల్ పారుకు సాయం ఎకడ?
మొన్న తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పేరొన్న మెగా టెక్స్టైల్ పార్ ఎకడ ఉన్నదో తెలంగాణ ప్రజలకు చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సూమారు రూ.1,552 కోట్ల తెలంగాణ ప్రభుత్వ నిధులతో మొదలుపెట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్లో కేంద్రం తరఫున కనీసం మౌలిక సదుపాయాలన్నా కల్పించాలని కోరితే ఇప్పటికీ స్పందించని బీజేపీ ప్రభుత్వం, మెగా టెక్స్టైల్ పార్ ఏర్పాటు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని దుయ్యబట్టారు. టెక్స్టైల్ రంగంలోని ప్రపంచస్థాయి కంపెనీల పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మార్చాలన్న లక్ష్యంతో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు సాయం చేయాలని లెకలేనన్ని సార్లు కోరినా అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
బంగ్లాదేశ్, శ్రీలంకతోపాటు అనేక చిన్న దేశాలు టెక్స్టైల్ రంగంలో మనకంటే ఎకువ వృద్ధిని నమోదు చేస్తున్నాయని గుర్తుచేస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానాల లోపం వల్లే టెక్స్టైల్ రంగంలో మనం వెనుకబడ్డామన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచంతో పోటీ పడేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఫైబర్ టు ఫ్యాషన్ మాడల్లో ఏర్పాటు చేస్తున్న ఈ టెక్స్టైల్ పార్లో ప్రపంచ టెక్స్టైల్ దిగ్గజాల్లో ఒకటైన యంగ్ వన్ కంపెనీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంతటి జాతీయ ప్రాధాన్యం గల ఈ పార్కు కేంద్రం సహకారం అందించాలని కోరారు.
సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఎటు పోయింది?
రాష్ట్రంలోనే అత్యధిక పవర్ లూమ్ మగ్గాలు ఉన్న సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరితే.. ఇప్పటిదాకా కేంద్రం స్పందించలేదని కేటీఆర్ ఆరోపించారు. కాంప్రహెన్సివ్ పవర్ లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ సీం కింద సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తే ఇంతవరకు అతీగతీ లేదన్నారు. సుమారు 26 వేల మంది పవర్ లూమ్ కార్మికుల ఆర్థిక భవిష్యత్తు కోసం మోదీ సరార్ చేసింది ఏమీ లేదని ఆగ్రహించారు. కానీ నేతన్నలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్న సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో నేతన్నల కోసం వీవింగ్ పార్, అపారల్ పార్తోపాటు కామన్ ఫెసిలిటీ సెంటర్లను సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పవర్లూమ్ మగ్గాల అప్గ్రేడేషన్ ఏమైంది?
రాష్ట్రంలోని పవర్లూమ్ మగ్గాల అప్గ్రేడేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం 50 శాతం నిధులను భరించేందుకు సిద్ధంగా ఉన్నదని, ఇందుకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినా స్పందన లేదని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తెలంగాణలోని మరమగ్గాల అప్గ్రేడేషన్ కోసం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర టెక్స్టైల్శాఖకు మంత్రులు మారుతున్నారే తప్ప, తెలంగాణ విజ్ఞప్తులకు మాత్రం సానుకూల స్పందన రావడం లేదని దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రభుత్వం, నేతన్నల తరఫున తాను లేవనెత్తిన ఈ అంశాలన్నింటిపై టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో సైతం నిలదీస్తారని తెలిపారు. కేవలం రాజకీయాల కోసం మాత్రమే తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులుగా వస్తున్న కేంద్ర మంత్రులు, ఇకడి నేతన్నల న్యాయమైన డిమాండ్లపై సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు పకనబెట్టి నేతన్నల బాగు కోసం పనిచేయాలని హితవుపలికారు. తెలంగాణ టెక్స్టైల్, చేనేత రంగానికి చేస్తున్న సాయం ఏమైనా ఉంటే అంతర్జాతీయ చేనేత దినోత్సవం నాటికి ప్రకటించాలని, లేకుంటే బీజేపీ నేతలను తెలంగాణ నేతన్నలు నిలదీస్తారని హెచ్చరించారు. నోటి మాటలు కాదు.. నిధుల మూటలు ఇవ్వండి, ప్రకటనలు కాదు.. పథకాలు రావాలి, తెలంగాణ టెక్స్టైల్, చేనేత రంగానికి ప్రోత్సాహం కావాలి అని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు.
హ్యండ్ లూమ్ టెక్నాలజీ ఎకడ?
యాదాద్రి, గద్వాల, నారాయణపేట, వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్ వంటి జిల్లాల్లో అత్యంత నైపుణ్యంగల సుమారు 40 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, ఇకత్, గొల్లభామ వంటి చీరలకు తెలంగాణ నెలవుగా ఉన్నదని కేటీఆర్ గుర్తుచేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు వెళ్లినందున అదే ఇన్స్టిట్యూట్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరితే కేంద్రం స్పందిచలేదని విమర్శించారు. దీంతోపాటు ఇకడి నేతన్నల ఆదాయాన్ని పెంచడంతోపాటు వారి భవిష్యత్తు తరాలకు చేనేత కళను అందించాలంటే ఈ సంస్థ అత్యవసరం అనే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా కేంద్రం చెవికి ఎకడం లేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో నేషనల్ టెక్స్టైల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్తోపాటు హ్యాండ్లూ మ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరితే కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్హెచ్డీపీ)లో భాగంగా తెలంగాణలో 15 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని చేసిన విజ్ఞప్తిని మోదీ సరార్ బుట్ట దాఖలు చేసిందని, వెంటనే ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలి, టెక్స్టైల్స్పై తగ్గించాలి
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖాదీ వస్త్రాలపై కూడా పన్ను విధించిన దుర్మార్గపు సర్కార్ బీజేపీదేనని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జీఎస్టీతో నేతన్నల నడ్డి విరుస్తున్న కేంద్ర అరాచక ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉధృతంగా సాగుతున్న నిరసన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొనైనా టెక్స్టైల్ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించడంతోపాటు చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని డిమాండ్ చేశారు. దేశంలోని చేనేత కార్మికులపై కేంద్రానికి ప్రేమ ఉంటే ఆదివారం జరిగే జాతీయ చేనేత దినోత్సవం నాటికి ఈ జీఎస్టీని రద్దు చేయాలని సూచించారు.