KTR | వేములవాడ : ఈ ఎన్నికలు మీ తలరాతను మార్చేవి అని యువకులను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరు దశాబ్దాల కాలంలో వందల మంది ప్రాణాలను తీసిన కాంగ్రెస్.. ఇవాళొచ్చి తియ్యటి మాటలు మాట్లాడితే మనం ఆగమైదామా..? ఆలోచించి ఓటేయండి అని కేటీఆర్ సూచించారు. తెలంగాణను చావగొట్టి, తాగు, సాగునీరు, కరెంట్ ఇవ్వకుండా రైతులను వేధించిన కాంగ్రెస్ పార్టీతోనే మనం పోరాటం అని తేల్చిచెప్పారు. పోటీ ఎప్పుడు రెండు ఆలోచన విధానాలు, సిద్ధాంతాలు, సంస్థల మధ్య జరుగుతది అని కేటీఆర్ పేర్కొన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ ఉద్యమంలో వేములవాడ, సిరిసిల్ల.. ఇలా మానేరు వాగు వెంట ఉన్న ప్రతి ఊరు ఉర్రుతలూగించిందని కేటీఆర్ గుర్తు చేశారు. మీరంతా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. మీరందరూ 2014లో ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ చాలా కష్టపడ్డారు అని కేటీఆర్ గుర్తు చేశారు. దొరల తెలంగాణ కావాల్నా..? ప్రజల తెలంగాణ కావాల్నా..? అని రాహుల్ గాంధీ అంటున్నారు. మీ సవాల్ను తెలంగాణ సమాజం స్వీకరిస్తున్నారు. ఢిల్లీ దొరలకు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మధ్య జరిగే ఎన్నిక ఇది. ఢిల్లీ దొరల సంగతి తెలంగాణ చూసింది. మీ మెడలు వంచింది. బీజేపీకి, కాంగ్రెస్కు తెలంగాణ సమాజం తప్పకుండా బుద్ది చెప్తది. ఢిల్లీకి, తెలంగాణకు మొదట్నుంచి పడదు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది. హైదరాబాద్ స్టేట్ పేరిట 1956లో ఒక ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాదణ ఉండే. వృద్ధిలో ఉండే. నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గోదావరి, కృష్ణా ప్రాజెక్టులకు రూపకల్పన చేసి అన్ని ఆలోచనలు చేసుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు.
నాడు మద్రాస్తో కలిసి ఉన్నఆంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. కర్నూల్ రాజధాని ఉండే. టెంట్లు వేసుకుని సవచివాలయం మూడేండ్లు నడిపారు. మనం ఏమో అప్పటికే జోర్డార్ ఉన్న హైదరాబాద్ రాష్ట్రం ముందుకు పోతుంది. కాంగ్రెస్ పెద్దలను ఏపీ పెద్దలు ఒప్పించారు. రాహుల్ ముత్తాత నెహ్రూను ఒప్పించి, మెప్పించి, ఆగం చేసి తెలంగాణలో ఆంధ్రాలో కలిపే కుట్ర చేశారు. కుట్ర చేయంగానే 1952లోనే విద్యార్థులు, యువకులు తిరబడగ్గారు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమంలో ఐదుగురి పిల్లల్ని ఢిల్లీ దొర నెహ్రూ పిట్టల్లా కాల్చిచంపించారు అని కేటీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణను, ఆంధ్రాను కలపొద్దని ఫజల్ అలీ చెప్పినప్పటికీ వినకుండా బలవంతంగా కలిపారు. బలవంతపు పెళ్లి చేసుకుంటూ.. ఖలీల్వాడీ మైదానంలో నెహ్రూ మాట్లాడుతూ.. అమాయకపు ఆడపిల్ల పెళ్లి అతి హుషారు పిల్లాడితో పెళ్లి చేస్తున్నా అని నెహ్రూ అన్నారు. సంసారం జరిగితే మంచిదే. లేదంటే విడాకులు తీసుకోవచ్చు అని నెహ్రూ మంత్రం చదివారు. ఆయన ఊహించినట్టే 12 ఏండ్లు గడవకముందే 1968లో తెలంగాణ తిరగబడ్డది. మాకు అన్యాయం జరుగుతంది. తెలంగాణ కావాలని కొట్లాడారు. 370 మంది పిల్లల్ని పిట్టల్ల కాల్చిచంపింది ఇందిరాగాంధీ ఢిల్లీ దొరసాని. తెలంగాణ ప్రజా సమితి నాయకత్వంలో మర్రి చెన్నారెడ్డి 11 మంది ఎంపీలను గెలిపించారు. మా తెలంగాణ మాకు కావాలని గెలిపిస్తే.. ఇందిరమ్మ 11 మంది ఎంపీలను గుంజుకెళ్లి కాంగ్రెస్ లోకలిపి తెలంగాణ ఆకాంక్షలను అణగదొక్కింది అని కేటీఆర్ గుర్తు చేశారు.
ఆ తర్వాత కలిసోచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టిండు అన్నట్టు 2001లో గులాబీ జెండా ఎగిరింది కేసీఆర్ నాయతక్వంలో. 14 ఏండ్ల పాటు కేసీఆర్, విద్యార్థులు, యువకులు రాష్ట్రం మొత్తం ఒక్కటై కదిలింది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో జెండా పాతినం. ఆ సమయంలో కాంగ్రెస్కు దిక్కు లేదు. తెలంగాణ ఇస్తమని చెప్పి, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు. నమ్మి పొత్తు పెట్టుకుంటే.. వందల మంది ప్రాణాలను తీసుకుంది సోనియమ్మ. ఉత్తగనే తెలంగాణ రాలేదు. ఇన్ని ప్రాణాలు పోతే, చాలా మంది కష్టపడితే, కేసీఆర్ నిరాహార దీక్షతో తెలంగాణ అట్టుడికితే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. ఇవ్వకపోతే వీపు చింతపండు అయితది.. చంపి పాతరేస్తరు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను అని రాష్ట్రాన్ని ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.