Minister KTR | ఏఐసీసీ అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ అని, బీజేపీ అంటేనే భ్రష్టాచార్ జనతా పార్టీ అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ-పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. 75 సంవత్సరాల భారత చరిత్రలో దేశాన్ని దోచుకున్న తోడు దొంగలే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అంటూ ధ్వజమెత్తారు. రెండు పార్టీలే అసమర్థ పాలనకు, అవినీతి ప్రభుత్వాలకు చిరునామా అంటూ మండిపడ్డారు.
దశాబ్దాల పాలనా వైఫల్యాల పాపమే దేశానికి, రాష్ట్రానికి శాపమైందని.. ఇంకా వెంటాడుతూనే ఉందని ఆరోపించారు. మమ్మల్ని నేరుగా ఢీకొనే దమ్ములేక.. ఎంఐఎం భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను కాల్చే కుట్ర బీజేపీ చేస్తోందని.. బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ కాల్చే కుతంత్రం కాంగ్రెస్ చేస్తోందన్నారు. వెన్నుపోటు వారసుడిని నమ్ముకుని వెన్నుముక లేని పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోయిందన్నారు. కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని స్పష్టం చేశారు.
మేం తెలంగాణ రైతులకు రిష్తేదార.. మేం తెలంగాణ ప్రజలకు వఫాదార్ అని, ఈ విషయం ప్రజలకు సైతం తెలుసునన్నారు. బీఆర్ఎస్ ప్రతి పథకం దిల్ దార్ అని, ప్రతి నిర్ణయం దమ్ దార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమాన్ దార్ అని, ప్రభుత్వం పూర్తిగా.. జిమ్మేదార్ తెలిపారు. మా తొమ్మిదేళ్ల పరిపాలన.. జోర్ దార్ అని, వచ్చే ఎన్నికల ఫలితాలు ధమాకేదార్.. దేశంలోనే తెలంగాణ మోడల్.. అసర్ దార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బేకార్ అని, కాంగ్రెస్ చరిత్ర అంతా భ్రష్టాచార్.. కాంగ్రెస్ను నమ్ముకుంటే మళ్లీ అంధకారమేనని కేటీఆర్ ట్వీట్ చేశారు.
75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో..
దేశాన్ని దోచుకున్న తోడు దొంగలే – కాంగ్రెస్, బీజేపీ
AICC అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటి
BJP అంటేనే భ్రష్టాచార్ జనతా పార్టీమీ పార్టీలే…
అసమర్థ పాలనకు కేరాఫ్..
అవినీతి ప్రభుత్వాలకు చిరునామా..మీ దశాబ్దాల..
పాలనా వైఫల్యాల పాపమే
దేశానికి,…— KTR (@KTRBRS) August 12, 2023