KTR | హైదరాబాద్ : ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి వరుణ్ రాజ్పై అమెరికాలో కత్తి దాడి జరిగిన విషయం విదితమే. ఈ ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికాలో భారతీయ రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారై స్నేహితుల సహాయంతో వరుణ్కు కావాల్సిన సహాకారాన్ని అందిస్తామన్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ఎక్స్లో వెల్లడించారు. వరుణ్ కుటుంబ సభ్యులతో తమ టీమ్ టచ్లో ఉంటారన్న కేటీఆర్ వారికి కావాల్సిన సహాయం అందిస్తామన్నారు. వరుణ్ పరిస్థితిపై మానసా కాపురి అనే డాక్టర్ చేసిన ట్వీట్పై కేటీఆర్ స్పందించారు.
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో చదువుకుంటున్న వరుణ్ రాజ్ను కత్తితో పొడిచారు. ఆ 24 ఏళ్ల విద్యార్థి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వరుణ్ తల భాగంలోకి జోర్డాన్ ఆండ్రాడ్ కత్తితో పొడిచాడు. జిమ్ నుంచి బయటకు వస్తున్న వరుణ్పై ఆండ్రాడ్ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే దాడికి గల కారణాల గురించి అధికారులు విచారిస్తున్నారు. అటాక్ తర్వాత దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యాయత్నం కింద కేసు బుక్ చేశారు. ఫోర్ట్ వెయిన్ హాస్పిటల్లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వరుణ్ కండీషన్ సిరీయస్గా ఉందని, అతను బ్రతికే ఛాన్సు కేవలం 5 శాతమే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
We will do our best to support Varun with the help of Indian embassy and also the Telangana NRI friends
Will have my team @KTRoffice get in touch with the family https://t.co/edV1mP5wez
— KTR (@KTRBRS) November 1, 2023