Minister KTR | హైదరాబాద్ : మోదీ సమన్లకు( Modi Notice ) భయపడేవారు తెలంగాణ( Telangana )లోఎవరూ లేరు.. తప్పకుండా విచారణను ఎదుర్కొంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
లిక్కర్ స్కాంలో మా ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )కు నోటీసులు ఇచ్చారు. మీ మాదిరిగా కాకుండా తప్పకుండా విచారణకు సహకరిస్తారు. ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోష్( BL Santosh ) విచారణకు రాకుండా దాక్కున్నాడు. భారత చట్టాలను గౌరవించే పౌరులుగా విచారణకు హాజరవుతాం.. విచారణను ఎదుర్కొంటాం. విచారణను ఎదుర్కొనే దమ్ము మాకుంది. విచారణను ఎదుర్కొనే దమ్ము మీకుందా.. అని మోదీని అడుగుతున్నాను. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యే. ఈ కక్ష సాధింపు ప్రజాకోర్టులోనే ఎదుర్కొంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.