హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): బీహార్ రాజకీయ పరిణామాలపై తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. ఎన్డీయే నుంచి ఒక్కో పార్టీ వైదొలగడాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ మినహా ఇంకే పార్టీ ఉన్నదని ఎద్దేవా చేశారు. ‘జేడీయూ వెళ్లిపోయింది. ఇప్పుడు ఎన్డీయేలో ఇంకెందరు భాగస్వాములున్నారు? సీబీఐ, ఐటీ, ఈడీ కాకుండా’ అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.