Minister KTR | హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణలో రియ ల్ ఎస్టేట్ ఢమాల్ అవటం ఖాయమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ పార్టీకి స్థిరమైన పాలన చేతకాదని, ప్రతి ఆరునెలలకు ఓ సీఎంను మార్చుతుందని వెల్లడించారు. దాంతో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోలేక రాష్ట్రంలో పరిస్థితులు అస్తవ్యస్తం అవుతాయని, అందు కు కర్ణాటకే ఉదాహరణ అని వివరించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు, నేడు ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిపై గురువారం హైదరాబాద్లోని ఓ హోటల్లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బెంగళూరులో రియల్ ఎస్టేట్ రంగం 28% పడిపోయినట్టు నివేదికలు చెప్తున్నాయని అన్నారు.
కాంగ్రెస్తో ప్రజలకు పవర్ ఉండదు
కాంగ్రెస్కు పవర్ ఉంటే ప్రజలకు పవర్ ఉండదని, కర్ణాటకే అందుకు ఉదాహరణ అని కేటీఆర్ అన్నారు. అందుకే తాము కరెంట్ కావాలో, కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరుతున్నామని చెప్పారు. 50 ఏండ్లలో కాంగ్రెస్ 7,700 మెగావాట్ల ఇన్స్టాల్ కెపాసిటీ విద్యుత్తు మాత్రమే ఏర్పాటు చేస్తే, తాము ఆరున్నరేండ్లలోనే 18,567 మెగావాట్లకు పెంచటమే కాకుండా, వచ్చే ఏడాది చివరికల్లా దామరచర్ల పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 24 వేల మెగావాట్లకు పెరుగుతుందని వివరించారు. సౌర విద్యుత్తు ఉత్పత్తిలోనూ రెండో అతిపెద్ద రాష్ట్రం అని తెలిపారు.
రాష్ట్రంలో 4-ఎస్ అభివృద్ధి
తమది సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి మాడల్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక్క రంగం అని కాకుం డా, అన్ని రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని తెలిపారు. ఈ విషయంలో చెన్నైలో ఉండే రజనీకాంత్కు అర్థమైనా, ఇక్కడుండే గజినీలకు అర్థం కావటం లేదని విమర్శించారు. వైద్యరంగం విషయానికొస్తే, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్, ఒక నర్సింగ్ కాలేజ్తోపాటు మల్టీ స్పెషాలిటీ దవాఖానల ను ఏర్పాటు చేశామని వివరించారు. ‘రైతు ఆ త్మహత్యలను గణనీయంగా తగ్గించాం. సాక్షా త్తు పార్లమెంటే ఈ విషయాన్ని ప్రకటించింది. నెలకు విద్యుత్తుపై వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నాం’ అని తెలిపారు. రాష్ట్రంలో ఐదు విప్లవాలు సాకారమయ్యాయని స్పష్టం చేశారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలు చేటం మంచిది కాదని ప్రతిపక్షాలకు హితవు చెప్పారు. రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చని, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాజెక్టును బద్నాం చేయవద్దని కోరారు.
ఫ్లోరోసిస్ను పారదోలిన ఘనత కేసీఆర్దే
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడు ఫ్లోరోసిస్ లేదని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు మంచినీటిని సమకూర్చలేకపోవడంవల్లే ఇది పెరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘ఓ సందర్భంలో యూఎన్ఓ సైతం నల్లగొండ జిల్లా మానవ రహిత జోన్గా మారుతుందని చెప్పింది. అటువంటి నల్లగొండకు నేడు శాశ్వతంగా ఫ్లోరోసిస్ నుంచి విముక్తి కలిగించిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా గ్రామ స్వరాజ్యం, పట్టణాల అభివృద్ధిని సాధించాం. హరితహారం ద్వారా 7.7 శాతం గ్రీన్కవర్ పెరిగింది. ఎక్కడా లేనివిధంగా బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. కల్యాణలక్ష్మి, దళితబంధు మా మ్యానిఫెస్టోలో పెట్టకుండానే ప్రవేశపెట్టాం’ అని వివరించారు. సంక్షేమంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని తేల్చిచెప్పారు. విద్యలోనూ అగ్రగామిగా నిలిచామని, ‘పలకతో రండి పట్టాతో పోండి’ అన్న నినాదంతోనే కేజీ టు పీజీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇందులోభాగంగానే వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ధరణితో రాబందులకు చెక్ పెట్టాం
గతంలో చేయి తడపందే రిజిస్ట్రేషన్లు అయ్యేవి కాదని, ధరణి ద్వారా నేడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇందులో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చని, వాటిని సరిచేసుకునే వీలుందని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ భూమేత పేరుతో ఏదో చేస్తామంటున్నదని, తిరిగి పట్వారీ వ్యవస్థను తెస్తామని చెప్తున్నదని, ఇది దళారీ వ్యవస్థ తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు.
మతాల మంటలు లేకుండా పాలన
యాదగిరిగుట్ట వంటి ఆలయాలు నిర్మించిన ఏకైక సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ చెప్పారు. మతంపేరుతో మంటలు పెట్టకుండా, మతాన్ని రాజకీయాలకు వాడకుండా రూ.1,200 కోట్లతో ఇంతపెద్ద ఆలయాన్ని పునర్నిర్మించామని అన్నారు. 500 కోట్లతో కొండగట్టు అంజన్న ఆలయం, 700 కోట్లతో వేములవాడ రాజన్న ఆలయం, 100 కోట్లతో ధర్మపురి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. మహిళల భద్రతకు భరోసా కల్పించడంతోపాటు శాంతిభద్రతలను గాడిలో పెట్టామని చెప్పారు. తెలంగాణలో అన్ని మతాలవారు సురక్షితంగా, సుఖశాంతులతో జీవిస్తున్నారని పేర్కొన్నారు.
ఉద్యోగాలపై మోదీ, రాహుల్కు సవాల్
ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ కన్నా మెరుగైన ప్రదర్శన చేసిన రాష్ట్రం ఏదైనా ఉంటే చూపాలని ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్ విసిరారు. ‘గత తొమ్మిదేండ్లలో 1,60,083ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 43,652 ఉద్యోగాల భర్తీ ప్రాసెస్లో ఉన్నది. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాలు ఏవైనా మాకన్నా మెరుగ్గా ఉద్యోగాల భర్తీ చేశాయా? గుజరాత్, రాజస్థాన్ వంటి పెద్ద రాష్ర్టాల్లోనూ 1.6లక్షల ఉద్యోగాల భర్తీ కాలేదు. ఇక, రాష్ర్టానికి మా పాలనలో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 24,000 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశాం. 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 300 పైచిలుకు పారిశ్రామికవాడలను ఏర్పాటుచేశాం’ అని వివరించారు.
తెలంగాణ యాస నేడు ైస్టెల్గా మారింది
తెలంగాణ యాసకు నేడు అత్యంత ఆదరణ లభిస్తున్నదని, ఒకనాడు జోకర్లు, విలన్లు మా త్రమే మాట్లాడే తెలంగాణ భాషను నేడు బాలకృష్ణ కూడా మాట్లాడుతున్నారని కేటీఆర్ చెప్పారు. మహేశ్బాబు, రామ్చరణ్, ఎన్టీఆర్ అయినా.. అందరూ మన భాషలో మాట్లాడుతున్నారని అన్నారు. నేడు ఏ సినిమాలోనైనా తెలంగాణ పాట లేకుండా లేని పరిస్థితి వచ్చిందని, రేడియో జాకీలు తెలంగాణ యాసలో మాట్లాడడం ైస్టెల్గా మారిందని వివరించారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి నిదర్శనమని అన్నారు. నేడు విదేశాల్లో బతుకమ్మ ఆడుతున్నారని, రాహుల్ ఆడారని తెలిపారు.
కేంద్రం సహకరించకున్నా సమగ్రాభివృద్ధి
‘కేంద్రంలో తెలంగాణను శత్రువులా చూసే ఓ దుర్మార్గమైన, అరాచక ప్రభుత్వం ఉన్నది. తమకు అప్పు ఇచ్చే ఏజెన్సీల చేతులు కట్టేసి అప్పులు పుట్టకుండా చేసింది. నీళ్లలోనూ వా టా తేల్చలేదు. ఇన్ని రకాలుగా అడ్డంకులు సృ ష్టించినా అనేక ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. మేం పనిచేసింది ఆరున్నరేండ్లే. మధ్యలో కొవి డ్తో ఎంతో నష్టం జరిగినా, గొప్పగా పాలన సాగించాం’ అని కేటీఆర్ వివరించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని తరచూ ప్రధాని చెప్తారని, అది డైలాగులతో, జుమ్లాలతో రె ట్టింపు కాదని చురక అంటించారు. దేశ ప్రజలు ఒక్కొక్కరిపై మోదీ 5 లక్షల అప్పు భారాన్ని మోపారని మండిపడ్డారు. అన్ని రంగాల్లో తె లంగాణను అభివృద్ధి చేశామని, వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని పేర్కొన్నారు.
తెలంగాణ రికార్డులు ఇవే..