లాస్ఏంజిల్స్: రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి కేటీఆర్.. ఆదివారం తెల్లవారుజామున లాస్ఏంజిల్స్ చేరుకున్నారు. దీంతో లాస్ఏంజిల్స్లో మంత్రి కేటీఆర్కు ఎన్ఆర్ఐలు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలతో మంత్రి కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిపై వారితో చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమాన్ని గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాయబారీలుగా వ్యవహరించాలని కోరారు.