హైదరాబాద్ : తమిళనాడుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. అన్నదురై తన ఆటోను ఫస్ట్ క్లాస్ క్యాబిన్గా మార్చుకున్నాడు. ఇది గొప్ప ఆలోచన అని కేటీఆర్ కొనియాడారు.
చెన్నైకి చెందిన అన్నదురై గత 10 ఏండ్ల నుంచి ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయితే ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలతో ఆటోను తయారు చేశాడు. ఆటోలో ఐపాడ్, ల్యాప్టాప్, ఫ్రిడ్జ్, స్నాక్స్, డ్రింక్స్తో పాటు ఫ్రీ వైఫై, పత్రికలను అందుబాటులో ఉంచారు. ఈ సదుపాయాలన్నీ కస్టమర్ల కోసమే కల్పించానని అన్నదురై పేర్కొన్నారు. తాను కస్టమర్లనే నమ్ముతానని, అందుకే లగ్జరీ గాడ్జెట్స్ను అందుబాటులో ఉంచానని స్పష్టం చేశాడు. డబ్బు కంటే కస్టమర్ల సంతోషమే తనకు ప్రధానమని ఆటో డ్రైవర్ అన్నదురై తెలిపాడు.