రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ)/తెలంగాణ చౌక్: మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని బీద, బిక్కి మం చిగుంటరని, తెలంగాణను మరొకరి చేతిలో పెట్టి తెర్లు జెయ్యద్దని ప్రజలకు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో పా ల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో సర్వాయిపాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘57 ఏండ్లు అధికారమిస్తే కరెంటు, మంచినీళ్లు ఇచ్చే తెలివి లేదు. ఇయ్యాల వచ్చి నా మీద, సీఎం కేసీఆర్పైనా అడ్డం పొడువు మాట్లాడుతున్నరు. తప్పు చేస్తే ఏమి తప్పు చే శామో చెప్పండి, ఇష్టం వచ్చినట్టు, నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడితే సహించేది లేదు’ అని కాంగ్రెస్, బీజేపీ నేతలను హెచ్చరించారు.
మా కంటే ఏ మంచి పనులు చేస్తారో చెప్పండి
కాంగ్రెస్ పాలనలో కరెంటు, ఎరువులు, విత్తనాలు టైంకు ఇవ్వలేదని, కనీసం కడుపు నిండా బువ్వ తిననియ్యలేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ పరిపాలనలో కరెంటు సమస్య పూర్తిగా తొలిగిపోయిందని, సాగునీటి ఇబ్బందులు లేకుండా చేశామని పేర్కొన్నారు. గోదావరి నీళ్లు మన పొలాలకు వచ్చాయని, సిరిసిల్ల, మానేరులో నీళ్లు సూడంగనే కడుపు నిండుతున్నదని సంతోషం వ్యక్తంచేశారు. కులం, మతం పేరుతో పనికిమాలిన పనులు చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. మాకంటే మంచి పనులు ఏమి చేస్తారో చెప్పాలని కాంగ్రెస్, బీజేపీ నేతలకు సవాల్ చేశారు.
మిగిలిన రైతులకూ త్వరలోనే రుణమాఫీ
ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.లక్షలోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేశామని, మిగిలిన రుణమాఫీ నిధులను కూడా త్వరలోనే బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. రుణమాఫీ కింద సోమవా రం ఒక్కరోజు రూ.6 వేల కోట్లు బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని గుర్తుచేశారు. స్వతం త్ర భారతదేశ చరిత్రలో రైతుల ఖాతాల్లో సీఎం కేసీఆర్ తప్ప రూ.73 వేల కోట్లు డిపాజిట్ చేసిన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉన్నారా? ఒకే ఒక్కరోజు రూ.ఆరువేల కోట్లు రుణమాఫీ పైసలు ఇచ్చిన సీఎం ఉన్నడా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అనేక కా ర్యక్రమాలు అమలుచేస్తున్నదని చెప్పారు.
ఈ రోజు నుంచే ఎన్నికల ప్రచారం
తన ఎన్నికల ప్రచారం ఎప్పుడూ సా రంపల్లి నుంచే ప్రారంభిస్తానని, ఇయాళ కూడా ఇక్కడి నుంచే వచ్చే ఎన్నికల ప్రచా రం మొదలుపెడుతున్నానని మం త్రి కేటీఆర్ ప్రకటించారు. ‘సర్వాయిపాపన్న ఆశీస్సులతో, మీ దయ ఉంటే మళ్లీ గెలిచి సిరిసిల్ల ప్రాంతాన్ని, ప్రతి ఊరును అభివృద్ధి చేస్తా’నని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను దీవించి సీఎంగా గెలిపిస్తేనే అ న్ని వర్గాలు బాగుపడుతాయని చెప్పారు. త్వరలోనే జిల్లాలో మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ ద్వారా ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఎస్టీపీడీసీ చైర్మన్ గూడూరిప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పాల్గొన్నారు.