హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చిస్తున్నారు. వీటితో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ, కార్యకర్తల జీవిత బీమా వంటి అంశాలపై చర్చించనున్నారు. పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణ పురోగతి, ఇతర అంశాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.