హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఇప్పటికైనా వ్యవసాయాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానించే చర్యలను మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రికి పోస్ట్ కార్డు రాశారు. వ్యవసాయాన్ని ఉపాధి పథకంతో అనుసంధానించాలని కేంద్రాన్ని డిమాండ్చేస్తూ పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. గతంలో రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తీర్మానం మేరకు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా పెద్ది కార్యాచరణకు పూనుకోవడాన్ని మంత్రి స్వాగతించారు. పెద్ది సుదర్శన్రెడ్డి ప్రారంభించిన పోస్టుకార్డు ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు అవుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.