జోగులాంబ గద్వాల : రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ధరూర్ మండలం జూరాల ప్రాజెక్టు వద్ద సందర్శకుల సౌకర్యార్థం రూ. 15 కోట్లతో నిర్మించే పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అంతముందు అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డు ఆవరణలో 100 పడకల ఆస్పత్రికి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, ఎంపీ రాములు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, సురభి వాణీదేవితో పాటు తదితరులు పాల్గొన్నారు.
మరికాసేపట్లో గద్వాల మండలం గోన్పాడ్ వద్ద షాదీఖాన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. సంగాల పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా గ్రంథాలయ భవనం, జూనియర్ కళాశాల కోసం భనవ నిర్మాణానికి శంకుస్థాపన, డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులకు, ఆడిటోరియం నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. మార్కెట్ యార్డు ఆవరణలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు భూమి పూజ చేసిన అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు.
నది అగ్రహారంలో పీజీ కళాశాలలో నూతనంగా నిర్మించిన మహిళ వసతి గృహాన్ని ప్రారంభించి, అక్కడే అదనపు తరగతి గదులకు భూమిపూజ చేస్తారు. లంచ్ అనంతరం 2:45కు అక్కడ నుంచి బయలుదేరి ఆర్వోబీని ప్రారంభిస్తారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో 3:15కు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. 4:15కు సభ ముగియగానే అక్కడి నుంచి హెలిక్యాప్టర్లో హైదరాబాద్కు మంత్రి కేటీఆర్ బయలు దేరనున్నారు.