హైదరాబాద్: హైదరాబాద్ నలుదిశలా ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తూర్పు హైదరాబాద్లో లక్ష మంది ఉద్యోగులు పనిచేసేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. జెన్ ప్యాక్ట్ విస్తరణ పూర్తయితే లక్ష లక్ష్యానికి సమీపిస్తామన్నారు. ఉప్పల్లో జెన్ ప్యాక్ట్ సంస్థ విస్తరణకు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. జెన్ ప్యాక్ట్ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. జెన్ ప్యాక్ట్ను వరంగల్లోనూ విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
పశ్చిమ హైదరాబాద్కు దీటుగా తూర్పు హైదరాబాద్ ఎదుగుతున్నదని చెప్పారు. తూర్పు ప్రాంత అభివృద్ధి కోసం నాగోలులో శిల్పారామం ఏర్పాటు చేశామన్నారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నదని చెప్పారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు స్కైవే నిర్మాణం జరుగుతున్నదని, ఉప్పల్ కూడలిలో స్కై వాక్ నిర్మాణం కూడా కొనసాగుతున్నదని చెప్పారు. ఇక్కడ ఐటీ పార్కుల నిర్మాణానికి డెవలపర్లు ముందుకొస్తున్నారని చెప్పారు. ప్రైవేటు డెవలపర్లకు ప్రభుత్వం తప్పకుండా మద్దతిస్తుందని తెలిపారు.
Ministers @KTRTRS & @chmallareddyMLA laid foundation stone for expansion of @Genpact Campus in Uppal in alignment with the GRID (Growth in Dispersion) Policy. pic.twitter.com/CRtLYN3TSr
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 13, 2022