మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మూసాపేట మండలం వేములకు (Vemula) చేరకున్న మంత్రి కేటీఆర్.. ఎస్జీడీ (SGD) ఫార్మా కార్నింగ్ టెక్నాలజీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మైక్రో రూరల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్లో (Bhootpur) మున్సిపల్ పార్కు, ఓపెన్ జిమ్లను ప్రారంభించారు.