సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో కొత్తగా నిర్మించనున్న జిల్లా రెడ్డి సంఘం భవనానికి భూమిపూజ చేశారు. అనంతరం రెడ్డి సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా న్యాయవాదులతో సమావేశమవుతారు.
తర్వాత ఎల్లారెడ్డిపేటకు చేరుకుని అక్కడ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గంభీరావుపేటలో జగదాంబదేవీ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ముస్తాబాద్ మండలంలో యాదవ సంఘ భవనాన్ని ప్రారంభిస్తారు.