మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ (minister KTR) పర్యటిస్తున్నారు. గుమ్మడూరులోని రామచంద్రాపురం కాలనీలో 200 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటిపేపర్లను అందజేశారు. అంతకుముందు మానుకోటలోని (Manukota) తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం రూ.5 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్ మార్కెట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు పాల్గొన్నారు.
మరికాసేపట్లో గుమ్మడూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో 24,181 మంది పోడు రైతులకు 67,730 ఎకరాలకు పోడు పట్టాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతారు.