హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్కు కజకిస్తాన్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. కజకిస్తాన్ వేదికగా జరిగే 2022 డిజిటల్ బ్రిడ్జి ఫోరమ్ సదస్సు రావాలని ఆహ్వానంలో పేర్కొన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో బ్రిడ్జ్ ఫోరమ్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో బ్రిడ్జ్ ఫోరమ్ సదస్సుకు గౌరవ అతిథిగా రావాలని కేటీఆర్కు ఆహ్వానం అందింది. బిగ్ డేటా, క్లౌడ్ సొల్యూషన్స్, డిజిటల్ సేవలపై సదస్సు నిర్వహించనున్నారు.