రాజన్న సిరిసిల్ల : ఈ మూడు నెలల పాటు ప్రణాళికబద్ధంగా కష్టపడి చదివి.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉద్యోగార్థులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మొబైల్స్ వాడకాన్ని తగ్గించాలని పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు కేటీఆర్ సూచించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ను కేటీఆర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జీవితం చాలా పెద్దది.. అపజయం ఎదురైనంత మాత్రాన కుంగిపోవద్దని చెప్పారు. నైపుణ్యం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే ప్రయివేటు రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణలో.. ఎన్నో అద్భుతాలు సృష్టించామని పేర్కొన్నారు. సాగునీటి రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామన్నారు. సాగునీటిని అందించడంతో బీడు భూములు కూడా సస్యశ్యామలం అయ్యాయని తెలిపారు. అభివృద్ధికి ప్రామాణికాలైన తలసరి ఆదాయం, జీఎస్డీపీలో ముందంజలో ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. మన నిధులు మన కోసమే ఖర్చు చేసుకుంటున్నామని చెప్పారు.
స్వరాష్ట్రం ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో 1 లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ తెలిపారు. కొత్తగా 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఎనిమిదేండ్లలో 19 వేల పరిశ్రమలు స్థాపించేలా చేసి, 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంత్రి @KTRTRS స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. pic.twitter.com/0Tfsbn8ZTy
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 15, 2022