సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్కు నివాళులు అర్పించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు తంగళ్లపల్లి మండలం మల్లాపూర్ చేరుకుంటారు. అక్కడ కొత్తగా ఏర్పాటుచేసిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 11 గంటలకు సారంపల్లిలో అంబేద్కర్కు నివాళులు అర్పిస్తారు. అనంతరం అంకుషాపూర్, లక్ష్మీపూర్లో రాజ్యాంగ నిర్మాత ప్రతిమలను అవిష్కరిస్తారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు తంగళ్లపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మానానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సిరిసిల్ల పట్టణంలో జిల్లా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ‘జయంతి సభ’లో పాల్గొంటారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు సాంఘిక సంక్షేమ హాస్టల్లో అదనపు సౌకర్యాల నిర్మాణాలను, సుందరీకరణలు, 2 గంటలకు బైపాస్ రోడ్లో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ భవన్ను మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం జిల్లాలో ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు దళిత బంధు చెక్కులను పంపిణీ చేస్తారు. తర్వాత వారితో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో దివంగత ఎమ్ఈవో మంకు రాజయ్య విగ్రహావిష్కరణ చేసి, ‘సంస్కరణ సభ’లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టరేట్లో వడ్ల కొనుగోలుకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.