మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. దేవరకద్ర మండలంలోని వెంకపల్లిలో రూ.55 కోట్లతో చేపట్టిన పేరూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. దేవరకద్ర మండలంలోని వెంకపల్లిలో రూ.55 కోట్లతో చేపట్టిన పేరూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అడ్డాకుల మండలం వర్నే-ముత్యాలపల్లి రోడ్డుపై బ్రిడ్జి, గుడిబండకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు పాల్గొన్నారు.
అటునుంచి భూత్పూర్ చేరుకుంటారు. భూత్పూర్ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ (సిద్దాయపల్లి) వద్ద నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందిస్తారు. భూత్పూర్లో మినీ స్టేడియం నిర్మాణానికి, సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సభ తర్వాత కోస్గి పట్టణానికి వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు.