ఖమ్మం: ఖమ్మం (Khammam) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. జిల్లాలోని కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిపామ్ ఫ్యాక్టరీకి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాములు నాయక్, ఎంపీలు, నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్ధసారథిరెడ్డి, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
అనంతరం ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన ఎన్టీఆర్ పార్క్, ఎస్బీఐటీ కళాశాల సమీపంలో మున్సిపల్ స్పోర్ట్స్ పార్క్, గోళ్లపాడు చానెల్పై నిర్మించిన పార్క్లు, వీడివోస్ కాలనీలో వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్లను ప్రారంభిస్తారు.