Minister KTR | హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో శుక్రవారం జీరో అవర్ లో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య సంభాషణ నవ్వులు పూయించిం ది. జీరో అవర్లో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో 250 మంది హోంగార్డులు ఎలాంటి ఆర్డర్స్ లేకుండా పనిచేశారని, వారి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘జగ్గన్నా మీదేం పాలనే. దిక్కుమాలిన పాల న. అసలు ఆర్డర్స్ లేకుండా హోంగార్డులు ఎలా పనిచేస్తారు?’ అంటూ ప్రశ్నించగానే సభలో నవ్వులు విరబూశాయి. సంబంధిత హోంగార్డుల వివరాలను అందిస్తే సమస్యను పరిష్కరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
మంచిని ఒప్పుకోరు.. మెచ్చుకోరు..?
జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, హెల్త్కార్డు సమస్యలతోపాటు క్యాన్సర్ వైద్యసేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘జగ్గన్న లేవగానే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతారనుకున్నా. వారు గతంలో అడిగిన విధంగా మెడికల్ కాలేజీని సీఎం మంజూరుచేశారు. మెట్రోను ఇస్నాపూర్ వరకూ పొడగించారు. అయినా జగ్గన్న కృతజ్ఞతలు చెప్పలేదు. ములుగులో సీతక్కకు కూడా మెడికల్ కాలేజీ వచ్చింది. అక్క కూడా ఏమీ చెప్పదు. పెద్దపల్లిలో మెడికల్ కాలేజీ వచ్చింది. శ్రీధరన్న కూడా చెప్పడు. ములుగు బాగా అభివృద్ధి చెందిందని అక్కడి స్థానికులు చెప్తున్నారు. సీతక్క తల్లిదండ్రులకు కూడా పోడుభూముల పట్టాలు వచ్చాయి. కానీ, వారు థ్యాంక్స్ చెప్పరు. ఇన్ని చేస్తున్న ప్రభుత్వాన్ని మెచ్చుకోరు. మాది సంస్కారం ఉన్న ప్రభుత్వం కాబట్టి ప్రతి సమస్యనూ పరిషరిస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
మీ పార్టీలో 10 మంది సీఎంలు ఉండొచ్చు
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా, నాడు సీజేఐగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణను సీఎం కేసీఆర్ దాదాపు పదిసార్లు స్వయంగా కలిసి మాట్లాడారని కేటీఆర్ వివరించారు. సమస్యను పరిషరించాలని మన ముఖ్యమంత్రే స్వయంగా విజ్ఞప్తి చేశారని కేటీఆర్ అనగానే జగ్గారెడ్డి, కాంగ్రెస్ సభ్యులు తమ సీట్లో నుంచే నవ్వారు. దీనిని గమనించిన కేటీఆర్ పంచ్లు విసిరారు. ‘మన ముఖ్యమంత్రి అంటే నవ్వుతున్నరు. మీకు వేరే ముఖ్యమంత్రి లేరు. ఆయనే. మీ కాంగ్రెస్లో పది మంది ముఖ్యమంత్రులు ఉండొచ్చు. కానీ రాష్ట్రానికి ఒకరే ఉంటారు’ అని కేటీఆర్ అనగానే నవ్వులు విరబూశాయి.