Minister KTR | సూర్యాపేట, జూన్ 29 (నమస్తే తెలంగాణ)/తిరుమలగిరి: రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి కర్ణాటక నుంచి ఒకడు, గుజరాత్ నుంచి ఇంకొకడు పైసల మూటలు తీసుకొని వస్తున్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయనగానే కొందరు మాయమాటలతో లత్కోరు సా బుల్లా వస్తున్నారని మండిపడ్డారు. మూటలు, మాటలకు పడిపోవద్దని, ఆ డబ్బు తీసుకొని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్కు మరోసారి పట్టం కట్టాలని అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణంలో దాదాపు 10 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.
మున్సిపాలిటీల పరిధిలో రూ.52 కోట్లతో చేపట్టనున్న వివిధ పనులకు మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెలే కిశోర్తో కలి సి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పా టు చేసిన సభలో.. తెలంగాణ అమరుల స్థూ పానికి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ చిత్రపటానికి నివాళి అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సభకు సుమా రు 50 వేల మందికిపైనే రావటం, అం దరిలో ఉత్సాహం చూస్తుంటే తుంగతుర్తి నుంచి ఎమ్మె ల్యే గాదరి కిశోర్కుమార్ 40 వేల మెజారిటీతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమైనట్టు స్పష్టం అవుతున్నదని అన్నారు. ఇది ప్రగతి నివేదన సభలా లేదని, ఎన్నికలకు ముందస్తు విజయోత్సవ సభలా ఉన్నదని తెలిపారు. ‘గాదరి కిశోర్ నేతృత్వంలో తుంగతుర్తిలో అభివృద్ధి, సం క్షేమం జోడెద్దుల మాదిరిగా పరుగులు తీస్తున్నది. తొమ్మిదేండ్లుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 2,600 కోట్లు, సంక్షేమ కా ర్యక్రమాల కోసం రూ.3,500 కోట్లు ప్రభు త్వం వెచ్చించింది. తుంగతుర్తి నియోజకవర్గంలోనే రూ.6 వేల కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. రూ.6 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారని అడిగే సన్నాసులు ఉంటారు. అందుకే మొత్తం లెక్కలతో వచ్చినం. చెప్పాల్సి న బాధ్యత మాపై ఉన్నది’ అని వివరించారు.
మోత్కూరు, తిరుమలగిరి మున్సిపాలిటీలకు చెరో రూ.10 కోట్లు కావాలని గాదరి కిశోర్ కోరగా, మంత్రి కేటీఆర్ వెంటనే రూ.20 కో ట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని గ్రామాలకు రోడ్లు కూడా కావాలని కోరగా, మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్తో మాట్లాడి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ముచ్చటగా మూడోసారి 40 వేల మెజారిటీతో తుంగతుర్తిలో గులాబీ జెండా ఎ గురవేయాలని ప్రజలను కేటీఆర్ కోరారు. మూడోసారి కారు గెలుపు ఖాయమన్నారు.
‘ఇటీవల ఓ కాంగ్రెస్ నేత పాదయాత్ర చేస్తున్నా అని ముందుకొచ్చిండు. తెలిసో, తెలియకో, చదువుకొనో, చదువురాకనో ఒక మాట మాట్లాడిండు. నల్లగొండ జిల్లాకు కేసీఆర్ ఏం చేసిండు? మంత్రి ఏం చేసిండు? నల్లగొండ జిల్లాకు నీళ్లు రాలేదు. అందుకే క్షమాపణ చెప్పాలని అడిగిండు. మాకు నిజాన్ని ఒప్పుకొనే ద మ్మూధైర్యం ఉన్నది. మా తప్పయితే మా ఉ మ్మడి జిల్లా 12 మంది ఎమ్మెల్యేలం కలిసి ఢిల్లీ దాకా ముక్కు నేలకు రాస్తాం. మా లెక్కలు నిజమని తేలితే మీరంతా ముక్కు నేలకు రాస్తా రా?’ అని కాంగ్రెస్ నేతలకు మంత్రి జగదీశ్రెడ్డి సవాల్ విసిరారు. ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దని, లెక్కలు తీద్దామని స్పష్టం చేశారు. ‘మీరు అధికారంలో ఉన్ననాడున్న అధికారులే నేడూ ఉన్నారు, ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో నాడు ఎన్ని ఎకరాల భూమి సాగైంది? సూర్యాపేట జిల్లాలో ఎంత భూమి సాగైంది? ఇప్పుడెంత సాగవుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంత సాగయిందో లెక్కలు అడుగుదాం. ఇవ్వాల సీఎం కేసీఆర్ పుణ్యమా అని ఈ జిల్లా రైతాంగం ఇంత అన్నం తింటున్నది. జిల్లా నుంచి ఫ్లోరైడ్ పారిపోయింది’ అని తెలిపారు. తెలంగాణను దేశానికి కేసీఆర్ పరిచ యం చేస్తే, ప్రపంచానికి పరిచయం చేసింది కేటీఆర్ అని జగదీశ్ కొనియాడారు. భారత ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అని అనుకుంటున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ సమయంలో నాపై దాదాపు 182 కేసులు మోపారు. అయినా భయపడలేదు. సీఎం కేసీఆర్ నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. తుంగతుర్తి ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తొమ్మిదేండ్ల కాలంలో ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన ప్రగతి సాధించాం. దాదాపు రూ.6,500 కోట్లతో అన్ని రంగాలను ముందుకు తీసుకుపోయినం. రక్తపుటేరులు పారిన నియోజకవర్గంలో కాళేశ్వర గంగ పరవళ్లు తొక్కుతున్నది.
– గాదరి కిశోర్కుమార్, తుంగతుర్తి ఎమ్మెల్యే