హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ తెలంగాణ విరోధి అని, ఆయన తెలంగాణ పుట్టుకనే అవమానించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, రాష్ట్రం కోసం 60 ఏండ్లు తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమాలను తకువ చేసి మాట్లాడుతూ మోదీ పదేపదే తన అకసును వెళ్లగకుతున్నారని సోమవారం ఓ ప్రకటనలో ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని పార్లమెంట్ సాక్షిగా తన గుడ్డి వ్యతిరేకతను వెళ్లగకడం ఇప్పటికే అనేకసార్లు చూశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదులపైన ఏర్పడిందని, అలాంటి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంబురాలు జరగలేదని మోదీ మాట్లాడటం దుర్మార్గమని పేర్కొన్నారు. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. కోట్లాది మంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న చారిత్రక అంశాల పట్ల సున్నితంగా వ్యవహరించడం నేర్చుకోవాలని మోదీకి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంబురాలు జరగలేదని అనడం ప్రధానమంత్రి అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే ఉద్దేశంతో ప్రధానమంత్రి పదేపదే కోట్లాదిమంది తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మానుకోవాలని సూచించారు.’
అమృత్కాల్ పేరుతో తెలంగాణపై విషం!
తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్, మోదీ ద్రోహాలను గుర్తు చేశారు. పార్లమెంట్ అమృత్కాల్ పేరుతో సమావేశాలను పెట్టిన మోదీ.. తెలంగాణపై విషం చిమ్మడం ఏ సంసారానికి గుర్తు అని ప్రశ్నించారు. తెలంగాణ అంటేనే గిట్టనట్టు.. పగబట్టినట్టు రాష్ట్ర పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? అని నిలదీశారు.‘మా దశాబ్దాల కల నెరవేరిన నాడు అటు ఆదిలాబాద్ నుంచి ఇటు అలంపూర్ దాకా తెలంగాణవ్యాప్తంగా జరిగిన మా సంబురాలు కనిపించలేదా?’ అని ప్రశ్నించారు. గాంధేయమార్గంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం జరిగిందనడం ఆత్మగౌరవ పోరాటాన్ని పార్లమెంట్ సాక్షిగా అవమానించడమే అని దుయ్యబట్టారు. గతంలో తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం, అహంకారంతో మాట్లాడారని, ఇంకెన్నిసార్లు తెలంగాణ అస్థిత్వాన్ని అవమానిస్తారని మోదీని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారని నిలదీశారు. ‘వడ్లు కొనాలని అడిగితే నూకలు బుక్కాలని మా రైతులను కించపర్చిండు మీ కేంద్రమంత్రి.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తదా? మీలాగే మీ మం త్రులు తెలంగాణ పట్ల తీవ్ర వ్యతిరేకత నింపుకున్నారు’ అని మోదీపై మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. నిధుల మూటలు ఎట్లా గూ తెలంగాణకు ఇవ్వని ప్రధాని, కనీసం.. మాటల్లోనైనా మర్యాద చూపించాలని సూచించారు. తెలంగాణపై వ్యతిరేకత నిం పుకున్న బీజేపీ.. డబుల్ ఇంజిన్ నినాదం తో ఊదరగొట్టినా తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావని చెప్పారు. డిపాజిట్లు పోగొట్టుకోవడంలో మళ్లీ సెంచరీ కొట్టడం పకా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన బీజేపీకి ఇ కడ పుట్టగతులు ఉండవని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఆపి, అదే పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ద్వేషం కాదు.. దేశం ముఖ్యం, దేశం అంటే రాష్ట్రాల సమాహారం’ అని తెలుసుకోవాలని ప్రధాని మోదీకి కేటీఆర్ సూచించారు.
మోదీకి కేటీఆర్ సూటిప్రశ్నలు