హైదరాబాద్: బీజేపీ నేత కే.లక్ష్మణ్పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సొమ్ము కేంద్రానిది.. సోకులు టీఆర్ఎస్ పార్టీవి అంటూ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారని ప్రశ్నించారు. లెక్కలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ సొమ్ముతో ఎంపీ లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబు ఉత్తరప్రదేశ్ సోకులు పడుతున్నదని విమర్శించారు. దేశ అభివృద్ధికి దోహద పడుతున్నందుకు తెలంగాణకు ధన్యవాదాలు చెప్పాలన్నారు.
‘ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు డాక్టర్ లక్ష్మణ్ గారు?. తెలంగాణ సొమ్ముతో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబు ఉత్తరప్రదేశ్ సోకులు పడుతున్నది. తెలంగాణ దేశ అభివృద్ధికి దోహద పెడుతున్నందుకు థాంక్స్ చెప్పండి. లెక్కలు తెలుసుకోండి. ఆత్మవంచన చేసుకుంటే మీ ఇష్టం కానీ ప్రజలని మభ్య పెట్టకండి’ అంటూ తెలంగాణ నుంచి కేంద్రం వసూలు చేస్తున్న గణాంకాలను పేర్కొంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు Dr.Laxman గారు?
తెలంగాణ సొమ్ముతో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబు ఉత్తర ప్రదేశ్ సోకులు పడుతున్నది
తెలంగాణ దేశ అభివృద్ధికి దోహద పెడుతున్నందుకు థాంక్స్ చెప్పండి
లెక్కలు తెలుసుకోండి👇 ఆత్మవంచన చేసుకుంటే మీ ఇష్టం కానీ ప్రజలని మభ్య పెట్టకండి pic.twitter.com/VrShH3nnPh
— KTR (@KTRTRS) September 22, 2022