Minister KTR | రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది.. 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నోట రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే నిన్న ధరణి తీసేస్తామని అన్నడు రాబందు.. నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నాడని అని సీరియస్ అయ్యారు.
నాడు చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నాడని.. నేడు చోటా చంద్రబాబు వ్యవసాయానికి మూడు పూటల కరెంట్ దండగ అంటున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. మూడెకరాల రైతుకు మూడు పూటల కరెంట్ ఎందుకు అనడం.. ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమే అని స్పష్టం చేశారు. నోట్లు తప్ప.. రైతుల పాట్లు తెల్వని రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టి కొట్టుడు ఖాయమని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నోట..
రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక.. !!కాంగ్రెస్ వస్తే…
నిన్న ధరణి తీసేస్తం అన్నడు.. రాబందు
నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడు..నాడు వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు
నేడు మూడుపూటలు దండగ అంటున్నడు ఛోటా చంద్రబాబుమూడు ఎకరాల రైతుకు..
మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం..…— KTR (@KTRBRS) July 12, 2023
కాంగ్రెస్కు ఎప్పుడూ చిన్నకారు రైతులు అంటే చిన్న చూపు అని.. సన్నకారు రైతు అంటే సవతి ప్రేమ అని అన్నారు. నాడు ఏడు గంటల కరెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్.. నేడు ఉచిత కరెంట్కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. మూడు గంటలతో మూడెకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలని ఎద్దేవా చేశారు. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగమవుతుందని అన్నారు. మరోసారి రాబందు 3 గంటల మాటెత్తితే.. రైతుల చేతిలో మాడు పగలడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం అని కేటీఆర్ పేర్కొన్నారు. రైతును రాజును చేసే మనసున్న సీఎం కేసీఆర్ కావాలా? మూడు గంటల కరెంట్ చాలన్న మోసకారి రాబందు కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు.
కేసీఅర్ గారి నినాదం…
*” మూడు పంటలు ”*కాంగ్రెస్ విధానం…*
*” మూడు గంటలు ”BJP విధానం
“మతం పేరిట మంటలు”*” మూడు పంటలు “* కావాలా..
*” మూడు గంటలు “* కావాలా..
“ మతం పేరిట మంటలు” కావాలా…తెలంగాణ రైతు…
తేల్చుకోవాల్సిన..
తరుణం ఇది..!!— KTR (@KTRBRS) July 12, 2023
కేసీఆర్ నినాదం మూడు పంటలు అని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ విధానం మూడు గంటలు.. బీజేపీ విధానం మతం పేరిట మంటలు అని పేర్కొన్నారు. మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అని పేర్కొన్నారు.