హైదరాబాద్ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది. మెడికల్ కాలేజీల మంజూరుపై ఇరువురి మధ్య హాట్ హాట్గా చర్చ జరుగుతోంది.
మెడికల్ కాలేజీలపై తెలంగాణ నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాలేదని మన్సూఖ్ మాండవీయ పేర్కొన్నారు. స్వల్పకాలంలో ప్రధాని మోదీ భారీగా వైద్య కళాశాలలు మంజూరు చేశారని తెలిపారు. ప్రతిపాదనలు పంపిన రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని మాండవీయ చెప్పారు.
కేంద్ర మంత్రి మన్సూఖ్ మాండవీయ ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంపై స్పందించే ముందు కేంద్రమంత్రి సమీక్షించే ఉంటారనే భావిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలపై 2015, 2019లో కేంద్ర వైద్యారోగ్య శాఖకు ప్రతిపాదనలు పంపామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు అడిగినా కూడా ఒక్క వైద్య కళాశాలను కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. బీబీనగర్ ఎయిమ్స్లో ఖాళీగా ఉన్న 544 పోస్టుల భర్తీలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ను యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. తెలంగాణ ఒక్క విద్యా సంస్థను కూడా మీ ప్రభుత్వం మంజూరు చేయలేదని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Before you jump up & respond, let me also remind you that your Govt failed to even fill the 544 Jobs Vacant in AIIMS Bibinagar
AIIMS was sanctioned during the UPA Govt & the fact is not ONE educational institution was sanctioned by NPA Govt; neither by your Dept nor by HRD pic.twitter.com/FCRm3rGWEu
— KTR (@KTRTRS) August 29, 2022