హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీకి చెందిన కొందరు దివాళాకోరు మేధావులు, జోకర్లు తెలంగాణలో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రజాకార్ సినిమా ప్రదర్శనపై సామాజిక మాధ్యమాల్లో ఓ వ్య క్తి చేసిన పోస్ట్పై మంగళవారం ఆయన స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రత లు దెబ్బతినకుండా చూసేందుకు సె న్సార్ బోర్డుతోపాటు తెలంగాణ పోలీసులతో కూడా రజాకార్ సినిమా ప్రదర్శనపై చర్చిస్తున్నామని వెల్లడించారు.