Minister KTR | కామారెడ్డి : తెలంగాణ( Telangana )కు పట్టిన శని బీజేపీ( BJP ).. మోడీ( Modi )కి, ఈడీ( ED )కి, బోడికి భయపడేది లేదు.. భయపడేది దొంగలు. ప్రజల వద్దకు వెళ్లి ప్రజా కోర్టులో తేల్చుకుందాం అని బీఆర్ఎస్( BRS Party ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తేల్చిచెప్పారు. ఎవరు నీతిమంతులో, ఎవరు అవినీతిపరులో.. ఎవరేం తప్పు చేశారో, ఒప్పు చేశారో.. 2023లో ప్రజలే తీర్పు ఇస్తారు అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికలు రాగానే బీజేపీ, కాంగ్రెస్( Congress ) నాయకులు వస్తారు. వారికి కర్రుకాల్చి వాత పెట్టాలి. కేసీఆర్( KCR )ను మూడోసారి సీఎంగా ఎన్నుకోవాలి. కేసీఆర్ను కాపాడుకొని ఈ దేశానికి స్పష్టమైన సందేశం ఇద్దాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లా( Kamareddy Dist ) జుక్కల్( Jukkal ) నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. రెండు రోజుల క్రితం తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ దేశంలో అద్భుతమైన మహానటుడు ఉన్నాడు. అతన్నిపంపితే ఆస్కార్ తప్పకుండా వచ్చేది. 2014లో ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. దేశం మొత్తం సంపద దోచి వాళ్ల దోస్తు ఖాతాలో వేస్తున్నాడు. వారి దగ్గర చందా తీసుకోని ప్రతిపక్ష పార్టీల మీద పడుతున్నాడు. పార్టీలను చీల్చి, ఎమ్మెల్యేలను కొని, దేశాన్ని ఆగం చేయాలని చూస్తున్నాడు. ఆయనను మహానటుడు అని ఉట్టిగానే అనలేదు. ఇలా నాటకాలు ఆడుతున్నందుకే మహానటుడు అని అన్నాను. రైతుల ఆదాయం డబుల్ చేస్తాను అన్నాడు. కానీ రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని అన్నాడు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నల్లధనం తెస్తానని చెప్పిండు. దాన్ని గురించి అడిగితే తెల్ల ముఖమేస్తున్నాడు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
55 ఏండ్లు కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఒక్క మంచి పని కూడా చేయలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. పాదయాత్రలు చేస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. 10 ఛాన్స్లు ఇచ్చారు. 50 ఏండ్లు అవకాశం ఇచ్చిన్పపుడు కరెంట్, నీళ్లు, విద్య ఇవ్వనోడు.. ఇవాళ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఇలా అడగడంతో వాళ్లు పిచ్చొళ్లా…? మనం పిచ్చొళ్లామా..? ఆలోచించాలి. నిన్న మొన్నటి దాకా మనల్ని చావగొట్టింది కాంగ్రెసోళ్లే. ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టలేదు. పెన్షన్లు ఇవ్వడం చేతకాలేదు. అసలు కాంగ్రెస్కు ఎందుకు ఇవ్వాలి ఛాన్స్లు. కాంగ్రెసోళ్లను పట్టించుకోవద్దు. అద్భుతమైన ఎమ్మెల్యే హన్మంత్ షిండేను 72 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలి. అవకాశం, అధికారం ఉన్నప్పుడు ఏం చేయలేనోడు.. ఇవాళ వచ్చి డైలాగులు కొడితే పడిపోదామా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మోసపూరిత మాటలకు మోసపోవద్దు అని కేటీఆర్ జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు సూచించారు.