minister ktr | ఢిల్లీ బాస్లకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నవంబర్ 3న నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టంకట్టి కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజానీకానికి పార్టీ తరఫున ధన్యవాదాలు.
ఈ గెలుపులో భాగంగా వేలాదిగా పని చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్స్కు, 40 రోజులుగా పార్టీ అభ్యర్థికి కోసం గెలుపు కోసం కృషి చేసిన గులాబీ దండుకి శిరస్సు వహించి.. పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు చాలా గొప్పగా పని చేసి, తమ కార్యకర్తలు, శ్రేణులను అద్భుతంగా నడిపించిన కీలకపాత్ర పోషించిన సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు కూనంనేటి సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, పల్లా వెంకట్రెడ్డి, జాలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, యాదగిరి రావుకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అన్నారు.
‘2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన మూడు ఉప ఎన్నికల్లో హుజూర్నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను నల్లగొండ గడ్డపై మొట్టమొదటి సారిగా 12 స్థానాలకు 12 స్థానాలను టీఆర్ఎస్కు కట్టబెట్టినందుకు, కొత్త చరిత్ర లిఖించినందుకు నల్లగొండ జిల్లా ప్రజానీకానికి, చైతన్యానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాం. రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలుంటాయని పెద్దలు ఎప్పుడో చెప్పారని, ఈ ఉప ఎన్నికల్లో అదే జరిగింది. అహంకారం, డప్పు మదం, రాజకీయ కళ్లునెత్తికెక్కి, పొరుగుతో బలవంతుపు ఉప ఎన్నిక ఉప ఎన్నికను తెలంగాణ, మునుగోడు ప్రజలపై రుద్దింది ఢిల్లీ బాస్లు నరేంద్ర మోదీ, అమిత్షా. ఇద్దరి అహంకారానికి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి ధన్యవాదాలు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగుర వేసినందుకు సంతోషపడుతున్నం. రుద్దిన ఎన్నికను.. రుద్దిన వారికే మీరు గుద్దిన గుద్దుడుకు చెక్కరొచ్చింది. ఎన్నికల్లో ఇక్కడ కనిపించిన మొఖం భారతీయ జనతా పార్టీ నుంచి రాజగోపాల్రెడ్డిదే కావొచ్చు. వెనుకుండి నాటకం మొత్తం నడిపింది అమిత్ షా, నరేంద్ర మోదీ అనే విషయం తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు’ అన్నారు.
‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గౌరవించాలనే ఇంగితం లేకుండా తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేయడంతో పాటు తెలంగాణలోనూ క్రూరమైన రాజకీయ క్రీడకు తెరలేపింది బీజేపీ పార్టీ. దీని వెనక ఉందని అమిత్ షా, నరేంద్ర మోదీ అని తెలిసే చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు తమ తీర్పుతో వారి అధికార మదాన్ని, బీజేపీ పార్టీ అహంకారాన్ని మునుగోడులో తొక్కి.. చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు. నిజానికి టీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా మెజారిటీ రావాల్సి ఉండే. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి అలాంటిది. కానీ, బీజేపీ ఢిల్లీ, గల్లీ నాయకత్వం.. మాకున్న సమాచారం ప్రకారం.. మొట్టమొదటి సారిగా ఢిల్లీ నుంచి డబ్బుల సంచులు వందల కోట్ల రూపాయలను తరలించారు.
అభ్యర్థిని అడ్డదారుల్లో గెలిపించేందుకు డబ్బు, మద్యం, అధికార మదంతో కొనిపారేయాలని మునుగోడు ఓటరును అని.. అసాధారణ పరిస్థితిని సృష్టించి.. ఎన్నికను డబ్బు మయం, ధనమయం చేసి జనాన్ని, జనం గొంతు నొక్కాలనే ప్రయత్నం బీజేపీ చేసింది. ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన వెంటనే రూ.కోటితో దొరికింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అనుచరుడు, కరీంనగర్ కార్పొరేటర్ భర్త చొప్పరి వేణు. ఈటెల రాజేందర్ పీఏ కడారి శ్రీనివాస్ రూ.90లక్షలతో దొరికింది నిజం కాదా?.. డాక్టర్ వివేక్ గుజరాత్ నుంచి హవాలా ద్వారా రూ.2కోట్లు తెప్పించి దొరికింది నిజం కాదా? డాక్యుమెంట్ ఎవిడెన్స్తో, పత్రికల్లో వచ్చిన కథనాలతో దొరికిన దొంగల గురించి మాట్లాడుతున్న తప్ప. ఆషామాషీగా మాట్లాడడం లేదు. వివేక్ ఒక కింగ్పిన్ మాదిరిగా గతంలో ఈటెల రాజేందర్కు గానీ, ఇటు రాజగోపాల్రెడ్డికి గానీ 75కోట్లు ఆయన కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? 75కోట్లు అభ్యర్థి పార్టీ మారగనే ఖాతాలోకి ప్రవహించింది నిజం కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా.. ఆయన అనుచరుడు రూ.కోటితో మణికొండలో పట్టుబడింది నిజం కాదా? జమున హ్యాచరీస్కు రూ.25కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది నిజం కాదా? ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా.. ఒక హవాలా ఆపరేటర్ మాదిరిగా వివేక్ను అడ్డం పెట్టుకున్నరు.. ఎందు కోసం ఈ కోట్ల రూపాయలు ఇస్తున్నారు. కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రా రూ.5.25కోట్లు మునుగోడులోని ఓటర్లు, బీజేపీ నేతలకు డైరెక్ట్గా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది నిజం కాదా? లిఖితపూర్వకంగా ఈసీకి ఫిర్యాదు చేస్తే.. ఎలక్షన్ కమీషన్పై ఒత్తిడి తెచ్చి.. ప్రేక్షపాత్ర వహించేలా చేసిన మాట వాస్తవం కాదా?.
ఒకటీ రెండు కాదు.. అధికార దుర్వినియోగం, విచ్చలవిడి తినానికి పరాటకష్ట. 15 కంపెనీల సీఆర్పీఎఫ్ పోలీసులను దించారు.45 ఐటీ టీమ్లను దించి ఏడు మండలాల్లో గ్రామీణ నియోజకవర్గ మీద దండయాత్ర వచ్చినట్టే వచ్చారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచారు.. మేమం పట్టుకుంటామని 40 టీమ్లు వచ్చింది వాస్తవం కాదా? ఇంత పెద్ద ఎత్తున వందకోట్లు ఎలక్షన్ కమిషన్కు షికాయత్ చేస్తే ప్రేక్షకపాత్ర వహించింది నిజం కాదా.. ఇలా ఎన్ని చేసిన చివరకు టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేకపోయారు. కొంత మెజారిటీని ప్రలోభ పెట్టి తగ్గించగలిగారు’ అని కేటీఆర్ అన్నారు.