కామన్వెల్త్ క్రీడల్లో శరత్ కమల్ ఆచంట, శ్రీజ ఆకుల జోడీ అద్భుతమైన ప్రదర్శన చేసింది. టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో మలేషియాకు చెందిన జావెన్ చూంగ్, కారెన్ లైన్ను ఓడించి స్వర్ణం గెలిచిన ఈ జోడీని.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అభినందించారు.
‘‘కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన శరత్ కమల్, శ్రీజకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మేమంతా గర్వించేలా చేశారు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో కూడా శరత్ కమల్ సత్తాచాటుతున్నాడు. సెమీస్లో విజయం సాధించి ఫైనల్ చేరాడు. సోమవారం జరగనున్న ఈ మ్యాచ్లో శరత్.. ఇంగ్లండ్కు చెందిన లియామ్ పిచ్ఫోర్డ్తో తలపడనున్నాడు.
Hearty congratulations to @sharathkamal1 and Sreeja Akula on winning the Gold medal in Table Tennis mixed doubles event at #CommonwealthGames
You made us all proud!#CWG2022 pic.twitter.com/l8rB5CtLHT
— KTR (@KTRTRS) August 8, 2022