KTR | హైదరాబాద్ : రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ మృతిపట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. వేముల మంజులమ్మ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధించారు కేటీఆర్. వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కేటీఆర్.
గత కొద్ది రోజుల అనారోగ్యంతో బాధపడుతున్న మంజులమ్మ.. హైదరాబాద్లోని ఓ ప్రయివేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కాగా, నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో శుక్రవారం ఉదయం అంత్యక్రియలు జరుగనున్నాయి. మంజులమ్మ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు.